ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ (IALA)




• సింగపూర్ లో 18-21 ఫిబ్రవరి, 2025 మధ్య జరిగిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ (IALA) యొక్క మొదటి జనరల్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ఉపాధ్యక్ష పదవికి భారతదేశం ఎన్నికైంది.

• 1957 లో ఒక ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (NGO)గా స్థాపించబడిన ఈ ఆర్గనైజేషన్ ప్రస్తుతం అంతర్-ప్రభుత్వ సంస్థ (IGO)గా మారింది.

• దీనిని గతంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైట్ హౌస్ అథారిటీస్ (IALA) అని పిలిచేవారు.

• దీని నినాదం: సక్సెస్ ఫుల్ వోయజెస్, సస్టయిన్ బుల్ ప్లానేట్(SUCCESSFUL VOYAGES, SUSTAINABLE PLANET)

దీని ప్రధాన విధులు:

• ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్కు సహాయాన్ని అందించడంలో సభ్యదేశాల సమన్వయం సాధించడం.

• సముద్ర పర్యావరణ పరిరక్షణకై అనువైన మార్గాలను అన్వేషిస్తూ సముద్రరంగంలో కీలక పాత్రను పోషిస్తుంది.

• సముద్ర భధ్రతకై అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందిస్తుంది.
. నావిగేషన్ సహాయాలను మెరుగుపరచడం మరియు సముద్ర రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం

• ఐక్యరాజ్యసమితి రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (SDG లు) అనుగుణంగా సభ్యదేశాలకు, అధికారులకు తగిన ప్రమాణాలను సిఫార్సు చేస్తుంది.

• సభ్యదేశాలు: 200 మంది సభ్యులుగా(అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలు) ఉన్నారు.

• భారతదేశం 1957 నుండి సభ్యదేశంగా ఉంది.


IALA మరియు భారతదేశం:

• భారతదేశం డిసెంబర్ 2025లో IALA కౌన్సిల్ సమావేశాన్ని మరియు సెప్టెంబర్ 2027లో ముంబైలో IALA సమావేశం & జనరల్ అసెంబ్లీని నిర్వహించనుంది.


 


Comments